News August 21, 2025
ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు: చిత్తూరు SP

వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల పొందేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ మణికంఠ గురువారం స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకొచ్చామన్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే సరిపోతుందన్నారు. మైక్ అనుమతులను మీసేవ కేంద్రాలలో పొందాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
Similar News
News January 23, 2026
చిత్తూరు జిల్లాలో భూ సమస్యలే ఎక్కువ..!

చిత్తూరు జిల్లాలో ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ గ్రీవెన్స్ డేకు అర్జీలు భారీగా వస్తున్నాయి. డిసెంబర్, జనవరి 19వ తేదీ వరకు ఒక్క రెవెన్యూ శాఖపైనే 1,238 అర్జీలు అందాయి. డిసెంబర్లో 742 ఫిర్యాదులకు 638 పరిష్కరించి, 78 రిజెక్ట్ చేశారు. 26 పెండింగ్లో ఉన్నాయి. జనవరిలో 496 మంది భూ సమస్యలపై అర్జీలు ఇవ్వగా 290 పరిష్కరించి, 42 రిజెక్ట్ చేయగా.. 164 అర్జీలు పరిష్కరించాల్సి ఉంది.
News January 23, 2026
రాష్ట్రంలోనే తొలిసారి నగరిలో..!

నెట్ జీరో క్యాంపస్ కాన్సెప్ట్ను ఫైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో తొలిసారి నగరి బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లలో అమలు చేయనున్నారు. ఇక్కడ ఎల్ఈడీ బల్బులు, 12 కిలోవాట్ల సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తడి వ్యర్థాల నుంచి కంపోస్టు తయారీ చేస్తారు. వర్షపు నీటిని నిల్వ చేసి.. నీటి వృథాను తగ్గిస్తారు. పచ్చదనం కోసం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేస్తారు. సీఎం చంద్రబాబు శనివారం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
News January 23, 2026
నగరిలో CM కాన్వాయ్ ట్రయల్ రన్

నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో కాన్వాయ్ ట్రయల్ రన్ శుక్రవారం నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి ట్రయల్ రన్ ప్రారంభమైంది. కీలక పాయింట్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, సేఫ్టీ జోన్లపై సిబ్బందికి స్పష్టత ఇచ్చారు. వాహనాల మధ్య తగిన గ్యాప్ ఉండేలా పరిమిత వేగంతో, క్రమశిక్షణతో ప్రయాణించాలని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.


