News November 7, 2025

ఎల్లంపల్లి ప్రాజెక్టు తాజా సమాచారం

image

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు నీటి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఉదయం 10:30 గంటల సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్లు, నిల్వ 20.18 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్ట్‌కు మొత్తం 27,624 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. HMWSకు 299, NTPCకి 121 క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా 27,204 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 24, 2026

నరసరావుపేటలో ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం

image

ఆడబిడ్డలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆకాంక్షించారు. శనివారం కలెక్టరేట్‌లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. బాలికల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి రక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

News January 24, 2026

ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోడౌన్‌ను పరిశీలించిన ఏలూరు కలెక్టర్

image

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోడౌన్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. భద్రత సీళ్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు గోడౌను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News January 24, 2026

నరసరావుపేట: ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్.. 16 అర్జీల స్వీకరణ

image

పల్నాడు కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశాల మేరకు నిర్వహించిన ‘ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు విశేష స్పందన లభించింది. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై మెుత్తం 16 అర్జీలను సమర్పించారు. వీటిపై జేసీ సంజన సింహా స్పందించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తూ, గడువులోగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.