News September 11, 2025
ఎల్లారెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు?

వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పులి అడుగులను గ్రామస్థులు గుర్తించారు. రెండు రోజుల క్రితం రామప్ప వాన గుట్టకు పులి అరుపులు వినిపించాయని స్థానికులు తెలపగా, అటవీ శాఖ అధికారులు వానగుట్ట ప్రాంతంలో పరిశీలన చేపట్టారు. రామప్ప వానగుట్ట నుంచి ఎల్లారెడ్డిపల్లి అటవీ ప్రాంతం మీదుగా పులి మేడారం వైపు వెళ్తుండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది.
Similar News
News December 7, 2025
GP ఎన్నికలపై “బండి” ఫోకస్

GP ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవడానికి కేంద్రమంత్రి బండి సంజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొదటి విడత నామినేషన్లు వేసిన సర్పంచ్ అభ్యర్థులతో వర్చువల్గా మాట్లాడుతున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు మండలానికి ఒక అబ్జర్వర్ నియమించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నుండి ఎలాంటి సహకారమైన అందిస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు. విజయావకాశాలున్న జీపీలకు కరీంనగర్ నుంచి ప్రత్యేక టీంను పంపిస్తున్నారు.
News December 7, 2025
సిరిసిల్ల: అత్తింటి వేధింపులతో వివాహిత సూసైడ్

సిద్దిపేట(D)లో అత్తింటి వేధింపులతో వివాహిత సూసైడ్ చేసుకుంది. దుబ్బాక మం. తిమ్మాపూర్కు చెందిన శ్రీకాంత్కు సిరిసిల్ల (D)
ఇల్లంతకుంట (M) పెద్దలింగాపూర్ వాసి సుష్మ(32)తో 12ఏళ్ల క్రితం పెళ్లైంది. కొంతకాలంగా భర్త, అత్త, మామల వేధింపులపై సుష్మ తరచూ తల్లిదండ్రుల వద్ద వాపోయేది. ఈ క్రమంలో సుష్మ శనివారం ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో భర్త, అత్త ఎల్లవ్వ, మామ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 7, 2025
కృష్ణా తరంగ్ ఛాంపియన్గా నిలిచిన పీబీ సిద్ధార్థ

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్ 2025 ఓవరాల్ ఛాంపియన్గా విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజ్ నిలవగా రన్నరప్గా విజయవాడ నలందా కాలేజ్ నిలిచింది. గత మూడు రోజులుగా విశ్వవిద్యాలయంలో నాలుగు విభాగాలకు సంబంధించి 28 కేటగిరీలలో పోటీలు నిర్వహించారు. శనివారం రాత్రి జరిగిన ముగింపు కార్యక్రమంలో పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు.


