News April 25, 2024
ఎల్లారెడ్డి: ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన ఆదర్శ, గురుకుల విద్యార్థులు

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో, ఎల్లారెడ్డి ఆదర్శ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్స్ పి. సాయిబాబా తెలిపారు. ఆదర్శ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థినీలు ఎస్. హర్షిత 945 (ఎంపీసీ), హాబీ మదిహ 922 (బైపీసీ), అశ్మిత 816 (సీఈసీ)లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.
Similar News
News April 15, 2026
నిజామాబాద్: అంగన్వాడీ.. డిజిటల్ వే

అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 3,250 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి కొత్త ఫోన్లను అందజేస్తున్నారు. పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ టీచర్లు కొత్త ఫోన్ల రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News April 15, 2026
NZB: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్లో జిల్లాకు 9 మెడల్స్

రాష్ట్ర స్థాయి అండర్ -17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో నిజామాబాద్ రెజ్లర్లు 9 మెడల్స్ సాధించారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో టి.వెంకటేష్ గోల్డ్ మెడల్, బి.రోజా సిల్వర్ మెడల్, జి.గణేష్ సిల్వర్ మెడల్ సాధించగా ప్రవీణ్, మహేందర్, సృజన, రాజేశ్వరి, గంగాధర్, అంబాదాస్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు కోచ్ కం మేనేజర్గా వ్యవహరించిన దేవేందర్, బిందు తెలిపారు.
News April 14, 2026
నిజామాబాద్లో జిల్లాలో 43.2 డిగ్రీల ఎండ

జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మచ్చర్లలో అత్యధికంగా 43.2 డిగ్రీలు, భీంగల్ 43.0, మోస్రా 42.9, NZB 42.8, మంచిప్ప, మల్కాపూర్, ఆలూర్, పెర్కిట్ 42.7, మెండోరా, జక్రాన్పల్లి 42.6, మోర్తాడ్, గూపన్ పల్లి 42.5, ఇస్సపల్లి 42.4, వేల్పూర్, రేంజల్ 42.3,సాలూర, కోటగిరి, నవీపేట, ఏర్గట్లలో 42.2, ఎడపల్లి 42.1, బాల్కొండ, కోరట్పల్లి 42.0, లక్మాపూర్, కులాస్పూర్,ధర్పల్లి 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


