News August 19, 2025
ఎస్పీ హర్షవర్ధన్ రాజు విస్తృత తనిఖీలు

విజిబుల్ పోలీసింగ్లో భాగంగా నగరంలోని బస్టాండ్ వద్ద పూర్ణకుంభం సర్కిల్, ఇందిరా ప్రియదర్శిని వెజిటబుల్ మార్కెట్, రైల్వే స్టేషన్ ప్రాంతాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆటో స్టాండ్ను పరిశీలించారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల పట్ల డ్రైవర్లు మర్యాదగా మాట్లాడాలని సూచించారు.
Similar News
News January 15, 2026
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

<
News January 15, 2026
ఇంద్రవెల్లి: ఇక ఈ బాధ్యత.. అల్లుడిదే..!

ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు హస్తినమడుగు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. మర్రిచెట్టుపై గంగా జలాన్ని భద్రపరిచారు. కలశం (జారీతాలి) నేలపై జారి పడకుండా మహాపూజలు అయ్యే వరకు చెట్టుపై మెస్రం వంశానికి చెందిన అల్లుడే భద్రపరుస్తుంటారు. ఈనెల 15, 16, 18న మహాపూజ, 22న దర్బార్, 22న పెర్సపేన్ బాన్కక్ పూజలు నిర్వహించనున్నారు.
News January 15, 2026
HYD: ఫ్యూచర్ సిటీలో ట్రాఫిక్ రద్దీకి చెక్

మహానగరంలో ట్రాఫిక్ తిప్పలు అంతా ఇంత కాదు. కిలోమీటర్ ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్లో ఈ సమస్య ఉండొద్దని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని ముందే అంచనా వేసి మహేశ్వరం, శంషాబాద్ ట్రాఫిక్ జోన్లుగా విభజించి 4 డివిజన్లు, 10 ట్రాఫిక్ PSలను నెలకొల్పనున్నారు. సమర్థ పర్యవేక్షణకు ట్రాఫిక్ జాయింట్ సీపీని కూడా నియమించనున్నారు.


