News December 2, 2025
ఏకాంత సేవలో ఆంతర్యం ఏంటంటే?

శ్రీవారి ఆరాధనలో రోజూ రాత్రి జరిగే చివరి సేవను ఏకాంత సేవ (లేదా) పవళింపు సేవ అంటారు. ఈ సేవలో వెండి మంచం, పట్టు పరుపుపై భోగ శ్రీనివాస మూర్తిని వేంచేపు చేస్తారు. స్వామిని నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ సమయంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించి, తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి సమర్పిస్తారు. ధనుర్మాసంలో భోగ శ్రీనివాసునికి బదులుగా, కృష్ణ భగవానునికి ఈ ప్రత్యేక ఏకాంత సేవను నిర్వహించడం ఆనవాయితీ. <<-se>>#VINAROBHAGYAMU<<>>
Similar News
News February 11, 2026
పార్వతీపురం: విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్స్

షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలను అందిస్తోందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం జిల్లాలో అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫోన్ నంబరు, ఆధార్, బ్యాంకు ఖాతా, కులధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు socialjustice.gov.in/schemes వెబ్సైట్ను సందర్శించండి.
News February 11, 2026
ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎంతంటే?

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.270 తగ్గి రూ.1,58,510కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 తగ్గి రూ.1,45,300 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 11, 2026
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ప్రస్తుతకాలంలో పిల్లలు, యుక్తవయస్సు వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో BP ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో BP ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి BP చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.


