News January 27, 2025
ఏటూరునాగారం: పొలాల్లో అద్భుత దృశ్యం అవిష్కృతం

ఏటూరునాగారంలోని జీసీసీ గ్యాస్ గోడౌన్ వెనకాల గల వరి పొలాల్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ ఎండిపోయిన చెట్టుపై అక్కడికి మేత కోసం వచ్చిన కొంగలు భారీ సంఖ్యలో వాలాయి. దీంతో పూర్తిగా ఆకులు రాలిపోయిన చెట్టుపై కొంగలు వాలడంతో ఆ దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంది. పొలాల్లో వివిధ పనులకు వచ్చిన కూలీలు చెట్టుపై ఉన్న కొంగల దృశ్యాలను చూసి మైమరిచిపోయారు.
Similar News
News November 9, 2025
సిరిసిల్ల: ముగిసిన పద్మశాలి సంఘం ఎన్నికల పోలింగ్

సిరిసిల్ల పద్మశాలి సంఘం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 5 వార్డులకు పోలింగ్ నిర్వహించగా 17వ వార్డులో 63, 20వ వార్డులో 57, 22వ వార్డులో 75, 24వ వార్డులో 96, 31వ వార్డులో 157 ఓట్లు పోలయ్యాయి. మిగతా 34 వార్డు డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. వివాదాల నేపథ్యంలో నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో సంఘం సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
News November 9, 2025
KMR: జిల్లా ప్రజలు ఆక్రోశ సభకు కదలిరావాలి: జస్టిస్ ఈశ్వరయ్య

ఈ నెల 15న జరిగే బీసీల ఆక్రోశ సభకు జిల్లాలోని అన్ని కుల సంఘాలు కదలి వచ్చి విజయవంతం చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డిలోని R&B గెస్ట్ హౌస్లో నిర్వహించిన BC సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. బీసీలు 42 శాతం విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు సాధించడానికి కామారెడ్డిలో ఈ ఆక్రోశ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని BC, SC, STలు హాజరై సభను విజయవంతం చేయాలన్నారు.
News November 9, 2025
సమాజం కోసం ఏర్పడిందే RSS: మోహన్ భాగవత్

RSS సమాజం కోసం ఏర్పడిందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ‘ఆర్ఎస్ఎస్ దేనికీ వ్యతిరేకం కాదు. అది అధికారాన్ని కోరుకోదు. సమాజంలో ప్రాధాన్యతను ఆశించదు. దేశ కీర్తి పెంచేందుకు సేవ చేయాలని కోరుకుంటుంది. మొదట్లో RSSను ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు’ అని అన్నారు. RSS 100ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


