News February 9, 2025
ఏటూరునాగారం: రేపటి ఐటీడీఏ గిరిజన దర్బారు రద్దు

ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయంలో రేపు (సోమవారం) జరగనున్న గిరిజన దర్బారు రద్దు చేసినట్లు పీవో చిత్రమిశ్రా ఆదివారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున గిరిజన దర్బారు నిర్వహించడం లేదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులు ఈ విషయాన్ని గమనించాలని పీవో కోరారు. దరఖాస్తులతో ఐటీడీఏకి రావద్దని సూచించారు.
Similar News
News February 16, 2026
TGలో మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్

* నిజామాబాద్ మేయర్గా ఉమారాణి(కాంగ్రెస్)
* కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్(బీజేపీ)
* నల్గొండ మేయర్గా బుర్రి చైతన్య(కాంగ్రెస్)
* ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్
* కోరం లేకపోవడంతో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
* అలియాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్గా కంఠం శిరీష(కాంగ్రెస్)
News February 16, 2026
FLASH: NZB మేయర్గా కూరగాయల ఉమారాణి

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్గా కాంగ్రెస్ నుంచి 49వ డివిజన్లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆమె భర్త కరాటే రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్కు నమ్మిన బంటుగా ఉన్నారు. ఎన్నికకు హాజరైన మెజారిటీ సభ్యులు ఆమెకు మద్దతు తెలిపారు. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆమెకు ఎక్స్ అఫీషియోగా ఓటు వేశారు.
News February 16, 2026
కర్నూలు జిల్లాలో యూరియా కొరత లేదు

కర్నూలు జిల్లాలో రబీ సీజన్కు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఇప్పటివరకు 18,168 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, ప్రస్తుతం 5,897 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఎరువుల కొనుగోలు సమయంలో ఎంఆర్పీ ప్రకారం చెల్లించి, రశీదు తీసుకోవాలని రైతులకు సూచించారు.


