News August 23, 2025
ఏడుగురికి జరిమానా.. ఇద్దరికి జైలు శిక్ష

నంద్యాలలో శనివారం వాహనాల తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఏడుగురికి రూ.39 వేలు జరిమానా, ఇద్దరికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు ఏఎస్పీ జావలి తెలిపారు. ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని 1వ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. వాహనదారులు నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.
Similar News
News January 12, 2026
కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదు: SC

కాంట్రాక్టు సిబ్బంది, ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదని SC స్పష్టం చేసింది. ‘రెగ్యులర్ ఉద్యోగులతో సమాన స్థాయిని వారు కోరలేరు. వారి మధ్య వ్యత్యాసాన్ని తీసేస్తే ప్రభుత్వంలో నియామకాల ఉద్దేశం దెబ్బతింటుంది’ అని పేర్కొంది. నంద్యాల(AP) మున్సిపాల్టీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా మానవతా దృష్టితో వీరిని రెగ్యులర్ చేసే అవకాశాలను చూడాలని సూచించింది.
News January 12, 2026
NRPT: ‘మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి’

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. సోమవారం HYD నుంచి జిల్లాల కలెక్టర్లతో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇవాళ తుది ఓటరు జాబితా విడుదల చేశామని కలెక్టర్ సీఎస్కు వివరించారు.
News January 12, 2026
కోడి పందేల నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ

జిల్లాలో కోడి పందేలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. కోడి పందేలు నిషేధం, శిక్షార్హ నేరం అనే అంశంపై రూపొందించిన అవగాహన పోస్టర్ను సోమవారం మదనపల్లె కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులతో కలిసి ఆవిష్కరించారు.


