News December 2, 2025
ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు నోటిఫికేషన్

ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి టి.చిట్టిబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2010-11 సంవత్సరం నుంచి 2025 వరకు డిగ్రీ, పీజీ ప్రవేశం పొందిన విద్యార్థులు స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు అర్హులుగా ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 4 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
Similar News
News February 19, 2026
పల్నాడు: బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూసుకెళ్లిన కారు

ఎడ్లపాడు హైవే పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా వెళుతున్న ఓ కారు ఆటో, బైక్ ను ఢీకొట్టి, బ్రిడ్జిపై నుంచి వాగులో పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న తండ్రితో పాటు 10 సంవత్సరాల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 19, 2026
అమరావతి: మౌలిక వసతుల కల్పనలో జాప్యం

అమరావతి రాజధాని గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో జాప్యం జరుగుతుందని పలువురు అంటున్నారు. జూన్ నాటికి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే పనులు మొదలు పెట్టకపోవడంతో పాటు గ్రామసభలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.906 కోట్లతో DPRలు సిద్ధం చేశారు. అడుగులు ముందుకు పడకపోవడంతో ప్రజలు నిరాశలో ఉన్నారు.
News February 19, 2026
నార్సింగి: దారుణం.. గంజాయి తాగించి బాలికపై గ్యాంగ్ రేప్

నార్సింగి PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికకు ముగ్గురు రౌడీషీటర్లు బలవంతంగా గంజాయి తాగించారు. ఆపై మత్తులో తనపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితులు ముగ్గురూ ప్రస్తుతం పరారీలో ఉండగా.. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిది నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీ అని సమాచారం.


