News August 21, 2025

ఏలూరులో కుళ్లిన మృతదేహం కలకలం

image

ఏలూరు పరిధిలో మూతబడ్డ భవనం సెల్లార్‌లో కుళ్లిన స్థితిలో మృతదేహం కలకలం రేగింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా, ఎస్ఐ మదిన భాషా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో గుర్తింపు సాధ్యం కాలేదు. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదని పోలీసులు తెలిపారు. చాలా రోజులుగా భవనం మూసివేయబడడంతో ఎవరూ గమనించలేదని ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News January 18, 2026

నాన్‌వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్‌‌లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్‌వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నాన్‌వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.

News January 18, 2026

ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

<>ఐఐటీ<<>> ఢిల్లీలో 29 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా అర్హత గలవారు అర్హులు. అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఐఐటీ హాస్పిటల్, ఎస్టేట్& వర్క్స్, హాస్టల్ విభాగంలో ఈ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.12వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://home.iitd.ac.in/

News January 18, 2026

కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

image

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.