News December 1, 2025

ఏలూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

ఏలూరు రూరల్ మండలం పెనుమాక లంక గ్రామానికి చెందిన సైదు వెంకన్న (47) మాదేపల్లి గంగానమ్మ గుడి వద్ద శనివారం మృతి చెందాడు. కూలి పనులు చేసుకునే వెంకన్న కూలి పనిలో వచ్చిన సొమ్ముతో మద్యం తాగి రోడ్డు పక్కనే నిద్రించేవాడు. శనివారం రోడ్డు పక్కనే అతను మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనారోగ్యంతో మృతిచెందాడని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.

Similar News

News February 13, 2026

మున్సిపాలిటీలో ‘హంగ్’ ఉత్కంఠ: కింగ్ మేకర్లుగా ఎక్స్-అఫీషియో ఓట్లు..!

image

అలంపూర్ పురపాలక ఎన్నికల సమరం ముగిసింది, కానీ అసలు సిసలైన రాజకీయ చదరంగం ఇప్పుడే మొదలైంది. ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడి, ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఛైర్మన్ ఎన్నికలో నిర్ణయాత్మక శక్తిగా మారనున్న ఎక్స్-అఫీషియో ఓట్లు ప్రస్తుతం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఆ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులు ఉన్నాయి.

News February 13, 2026

మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం

image

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 60 స్థానాలు ఉండగా 44 డివిజన్‌ల కార్పొరేట్ స్థానాలను కాంగ్రెస్ సాధించింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఫార్వర్డ్ బ్లాక్ 2, జనసేన ఒక డివిజన్లో గెలుపొందాయి. 57వ డివిజన్లో రీకౌంటింగ్ చేయగా బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు.

News February 13, 2026

మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ హవా

image

మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ సత్తా చాటింది. మెట్‌పల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. అందులో బీజేపీ 10 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలను, బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలను గెలుచుకోగా స్వతంత్రులు 4 స్థానాలలో గెలుపొందారు. కాగా, ఛైర్‌పర్సన్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఛైర్‌పర్సన్ ఎన్నికలో స్వతంత్రులు కీలకం కానున్నారు.