News March 8, 2025
ఏలూరు జిల్లాలో అపరాల కొనుగోలు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో అపరాలు, మినుములు, పెసలు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏలూరు కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు.
Similar News
News December 15, 2025
టమాటా కాయ ఆకృతి కోల్పోవడానికి కారణం ఏమిటి?

టమాటా కాయలు ఆకృతిని కోల్పోయే సమస్య ఎక్కువగా కాయలో పూత చివరి వైపు కనిపిస్తుంది. పిందె కట్టే దశలో చల్లని వాతావరణం వల్ల కాయ ఆకృతి కోల్పోతుంది. పెద్ద పరిమాణం గల కాయరకాల్లో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. దీని నివారణకు కలుపు మందులు లేదా పెరుగుదలను నియంత్రించే రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. టమాట పంటను మురుగు నీరు బయటకు పోయే వసతి లేని నేలల్లో పండించకూడదు.
News December 15, 2025
పెరగనున్న టీవీల ధరలు!

కొత్త ఏడాదిలో TVల ధరలు పెరిగే అవకాశం ఉంది. మెమొరీ చిప్ల కొరత, రూపాయి పతనం, దిగుమతి వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో జనవరిలో 3 నుంచి 10% వరకు టీవీల ధరలు పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని తయారీ కంపెనీలు డీలర్లకు ఈ విషయం తెలియజేశాయని పేర్కొంటున్నాయి. గత మూడేళ్లలో మెమొరీ చిప్ల ధరలు 500% ఎగిశాయని, వచ్చే 6 నెలలూ పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి.
News December 15, 2025
SRD: సర్పంచ్ అభ్యర్థి సూసైడ్.. చనిపోయి గెలిచిన రా’రాజు’

నమ్మినవారే మోసం చేశారు. డబ్బు ఉన్నంత సేపు అతనితో ఉండి డబ్బు అయిపోయాక ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీపడ్పల్లి సర్పంచ్ అభ్యర్థి చాల్కి రాజు ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ నిన్న వెలువడిన ఫలితాల్లో గ్రామస్థులు అభిమానం చాటారు. చాల్కి రాజుకు 699 ఓట్లు పోలయ్యాయి. దీంతో 9 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.


