News September 13, 2025
ఏలూరు జిల్లా మీదుగా నూతన నేషనల్ హైవే: ఎంపీ

ఖమ్మం – కొవ్వూరు జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకాతిరుమల – ఏలూరు – కైకలూరు – కత్తిపూడి మీదుగా నూతన జాతీయ రహదారిని ప్రతిపాదిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ వెల్లడించారు. శనివారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త రహదారి కోసం త్వరలో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపుతామని ఎంపీ చెప్పారు.
Similar News
News December 6, 2025
బంధం బలంగా మారాలంటే?

భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు ఎంత సమయం గడిపితే అనుబంధం అంత దృఢమవుతుందంటున్నారు నిపుణులు. వ్యక్తిగత, కెరీర్ విషయాల్లో ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా.. రోజూ కాసేపు కలిసి సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తమ మధ్య పెరిగిన దూరానికి అసలు కారణాలేంటో, ఇద్దరి మనసుల్లో ఉన్న ఆలోచనలేంటో పంచుకోవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. ఇద్దరూ తిరిగి కలిసిపోయేందుకు మార్గం సుగమమవుతుంది.
News December 6, 2025
అప్పుల భారతం.. ఎంతమంది EMIలు కడుతున్నారో తెలుసా?

దేశంలో 28.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏడేళ్లలో భారీగా పెరిగారని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో తెలిపారు. 2017-18లో 12.8 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారని పేర్కొన్నారు. 2025లో కుటుంబ రుణాలు ₹15.7 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. 2018లో సగటున ఒక్కొక్కరిపై ₹3.4 లక్షల అప్పు ఉండగా, ఇప్పుడు ₹4.8 లక్షలకు పెరిగింది. ఈ లెక్కన దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు EMIలు కడుతున్నారు.
News December 6, 2025
పాలేరు జలాశయంలో మత్స్యకారుడు మృతి

కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ వాల్య(65)అనే మత్స్యకారుడు మృతి చెందాడు. తండావాసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన వాల్యకు చేపల వలలు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి పోయాడు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.


