News December 2, 2025
ఏలూరు: పల్స్ పోలియోపై డీఎంహెచ్ఓ సమీక్ష

ఏలూరులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రాబోయే పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై డీఎంహెచ్ఓ డా. అమృతం మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 21న జరగబోయే కార్యక్రమం గురించి ఆమె పలు అంశాలను వివరించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శోభ టీకా భద్రపరిచే విధానం, బృందాల సమన్వయంపై మెడికల్ ఆఫీసర్లకు ప్రత్యేక సూచనలు చేశారు.
Similar News
News February 18, 2026
కర్నూలు: ఒక్క నిమిషం ఆలస్యమైనా..

కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నేడు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి లీలా వెంకటేశ్ శేషాద్రి తెలిపారు. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. గేట్ క్లోజర్ సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎవరినీ లోపలికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
News February 18, 2026
ఇండియా Vs సౌతాఫ్రికా.. అన్నదమ్ముల పోరు!

T20 WC <<19168527>>సూపర్-8<<>>లో భాగంగా ఈనెల 22న ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ 2 జట్లకు అన్నదమ్ములు కోచింగ్ స్టాఫ్గా ఉండటం గమనార్హం. SAకు అల్బీ మోర్కెల్ కన్సల్టింగ్ కోచ్గా, INDకు బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్ వ్యవహరిస్తున్నారు. ‘ఈ మ్యాచ్ విషయంలో మా ఇద్దరి కంటే అమ్మ ఎక్కువగా ఆందోళన చెందుతోందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే IND, SAలో ఎవరికి మద్దతివ్వాలో ఆమెకు తెలియట్లేదు’ అని అల్బీ చెప్పారు.
News February 18, 2026
ఖమ్మం: న్యాయవాది నుంచి కౌన్సిలర్గా

కోర్టులో కేసులు వాదించే స్థాయి నుంచి ప్రజల పక్షాన నిలిచే ప్రజాప్రతినిధిగా అడ్వకేట్ దండి శ్రీజ బాధ్యతలు చేపట్టారు. ఎదులాపురం మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్గా సీపీఐ తరపున విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఖమ్మం జిల్లాలో న్యాయవాదిగా సేవలందించిన శ్రీజ, ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మిత్రులు ఆమెను అభినందించారు.


