News November 5, 2025
ఏలూరు: మైనారిటీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

ఏలూరులోని మైనారిటీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు) విద్యార్థులకు టీఈటీ, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఇన్ఛార్జి కార్యనిర్వాహక సంచాలకులు ప్రభాకరరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News January 15, 2026
ఇరాన్ పాలకులు మారితే ఇండియాకు నష్టమా?

ఇరాన్లో పాలనాపగ్గాలు మారితే భారత్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మన దేశం నుంచి అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఆసియాకు వెళ్లే మార్గాన్ని పాకిస్థాన్ మూసేసింది. ఇరాన్ నుంచే వెళ్తున్నాం. కొత్త పాలకులు వస్తే ఏం చేస్తారనేది సస్పెన్సే. అలాగే ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్ట్ సందిగ్ధంలో పడుతుంది. ఇరాన్ బలహీనపడితే సున్నీ మెజారిటీ ఉన్న పాకిస్థాన్ బలపడే ఛాన్సుంది.
News January 15, 2026
అన్నమయ్య జిల్లాలో కొర్రమీను పెంపకం.. లాభాలమయం..!

అన్నమయ్య జిల్లాలో PMDDKY పథకం కింద ఫామ్పాండ్ల ఆధారంగా (ముర్రెల్) కొర్రమీను పెంపకం విజయవంతంగా సాగుతోంది. కిలోకు రూ.300 – రూ.500 వరకు లభించడంతో లాభాలు వస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతులతో ఒక్క సైకిల్లో 0.5 నుంచి 1 టన్ను వరకు ఉత్పత్తి వస్తోంది. ఉద్యానవన పంటలతోపాటు చేపల సాగు చేపడితే ఒక్క పంటకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు నికర ఆదాయం లభిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇండియా పేర్కొంది.
News January 15, 2026
బీసీలకు 42% సీట్లు.. పార్టీలు ఇచ్చేనా?

TG: మున్సిపల్ ఎన్నికల్లో SC ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించకుండా అమలు చేశారు. BCలకు 42% స్థానాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, BRSకు ఇదో అవకాశంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో 32%(38 స్థానాలు) కార్పొరేషన్లో 30%(3 చోట్ల) కేటాయించింది. కాగా హామీని నెరవేర్చేందుకు మరో 12 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలోనూ BC అభ్యర్థులనే ప్రకటించాల్సి ఉంది. మరి పార్టీలు ఎలాంటి ప్రకటన చేస్తాయో చూడాలి.


