News March 5, 2025

ఏలూరు: 1000 ఓట్లు కూడా దాటని ఎమ్మెల్సీ అభ్యర్థులు

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థులలో చాలా మందికి మూడంకెల స్కోరు కూడా దాటలేదు. మరికొందరికైతే 100 లోపు ఓట్లే పడ్డాయి. హేమ కుమారికి 956, వానపల్లి శివ గణేష్ 772, అసన్ షరీఫ్ 759, బండారు రామ్మోహన్ 709, చిక్కాల దుర్గాప్రసాద్ 665, కాట్రు నాగబాబు 565 ఇలా చాలా మంది అభ్యర్థులు 1000 మార్క్ కూడా టచ్ చేయలేకపోయారు.

Similar News

News December 7, 2025

నంద్యాలలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

image

నంద్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజల రక్షణ, భద్రతకు భరోసా కల్పించేందుకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ఉపయోగ పడుతుందన్నారు. నంద్యాల MS నగర్, VC కాలనీ, బ్రాహ్మణ కొట్కూరు పరిధిలోని కోళ్లబవాపురం గ్రామం, పాములపాడు పరిధిలోని మిట్టకందాల గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

News December 7, 2025

ఈ నెల 10 నుంచి టెట్ పరీక్షలు: డీఈవో

image

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని,ఎమ్మిగనూరులో 1 చొప్పున ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్‌లో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.

News December 7, 2025

సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు

image

మెదక్‌లో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలో పెద్దపల్లి జిల్లా నాయకులు ఈ రోజు బయలుదేరి వెళ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఏ.ముత్యం రావు, తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి 9 వరకు ఈ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణను రూపకల్పన చేస్తారని తెలిపారు.