News April 3, 2024

ఒంగోలు: సైబర్ మోసాల పట్ల అప్రమత్తత తప్పనిసరి

image

సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరమేశ్వర రెడ్డి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రముఖుల ప్రొఫైల్ పిక్ తో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News March 17, 2026

ఒంగోలు: బస్సు ప్రయాణంలో రూ.9 లక్షల బంగారం చోరీ.. చివరికి.!

image

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో దొంగిలించిన 120 గ్రాముల బంగారం కేసును ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన బోయిన హిమబిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను గుర్తించారు. రూ.9 లక్షల విలువైన బంగారం రికవరీ చేసి SP హర్షవర్ధన్ రాజు బాధితురాలికి అందజేశారు.

News March 17, 2026

ప్రకాశం SP పరిష్కార వేదికకు 95 అర్జీలు

image

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన లభించినట్లు SP కార్యాలయం పేర్కొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదారులు పెద్ద ఎత్తున వేదికకు వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 95 అర్జీలను SP హర్షవర్ధన్ రాజు సోమవారం స్వీకరించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి న్యాయం అందించేందుకు సంబంధిత అధికారులకు సూచించారు.

News March 17, 2026

ప్రకాశం SP పరిష్కార వేదికకు 95 అర్జీలు

image

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన లభించినట్లు SP కార్యాలయం పేర్కొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదారులు పెద్ద ఎత్తున వేదికకు వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 95 అర్జీలను SP హర్షవర్ధన్ రాజు సోమవారం స్వీకరించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి న్యాయం అందించేందుకు సంబంధిత అధికారులకు సూచించారు.