News August 12, 2025
ఒంటిమిట్టలో 60 శాతం దాటిన పోలింగ్

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటలకు పులివెందులలో 71.36శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 7,565 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో 66.39శాతం ఓటింగ్ జరగ్గా.. 24, 606 ఓట్లకు 16,336 ఓట్లు పోలయ్యాయి. 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.
Similar News
News March 9, 2026
బి.మఠం: అంబులెన్స్లో ప్రసవం.. తల్లీబిడ్డా సేఫ్

అంబులెన్స్లో మహిళ ప్రసవించిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. బి.మఠం మండలం పలుగురాళ్లపల్లికి చెందిన గర్భిణి అపర్ణను పోరుమామిళ్ల నుంచి ప్రొద్దుటూరు ఆసుపత్రికి 108 అంబులెన్స్లో తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే అపర్ణ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహాలక్ష్మి, పైలట్ వెంకటేశ్వర్లు తెలిపారు. అంబులెన్స్ సిబ్బందిని పలువురు అభినందించారు.
News March 9, 2026
VRకు కడప జిల్లా కానిస్టేబుల్.!

కడప జిల్లా కలసపాడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కిషోర్ను VRకు పంపినట్లు SI సుహాన్ తెలిపారు. కిషోర్ కలసపాడు PSలో కోర్ట్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులపట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో కడప జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో విఆర్కు పంపినట్లు కలసపాడు ఎస్సై వివరించారు.
News March 9, 2026
కడప: ‘ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి’

మహిళా సాధికారతలో భాగంగా ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ మహిళలకు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మహిళా సాధికారిత కోసం మొదటి సారిగా 1995-96లో CM చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో 40వేల సంఘాలు ఉన్నాయన్నారు.


