News May 14, 2024

ఓటు వేయని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి

image

జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు సొంత ఊరు చిత్తూరు. గత ఎన్నికల్లో ఆయన అక్కడే ఓటు వేశారు. జనసేనలో చేరిన తర్వాత ఆయన తన ఓటును తిరుపతికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నారు. చివరి నిమిషంలో ఓటు బదిలీ కాలేదు. చిత్తూరులోనే ఆయన ఓటు ఉండిపోయింది. ఈక్రమంలో ఆయన నిన్న తనకు తానే ఓటు వేసుకోలేకపోయారు. అలాగే తిరుపతిలో పోలింగ్ సరళిని పరిశీలిస్తూ చిత్తూరుకు కూడా వెళ్లి ఓటు వేయలేదు.

Similar News

News December 16, 2025

చిత్తూరు: నూతన పోలీసుకు SP సూచనలు.!

image

చిత్తూరు జిల్లాలో ఎంపికైన పోలీసు కానిస్టేబుల్లు వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో 22వ తేదీ నుంచి వచ్చే నెల 9 నెలల ఇండక్షన్ శిక్షణ పొందవలసి ఉందని SP తుషార్ డూడీ తెలిపారు. ఎంపికైన వారు 20వ తేదీ ఉ.9 గం.లకు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు రావాలన్నారు. వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్, 6 ఫొటోలు, రూ.100 బాండ్‌తో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ 9 నెలలు ఉండనుంది.

News December 16, 2025

AMCల ద్వారా రూ.80 లక్షల ఆదాయం

image

జిల్లా మార్కెటింగ్ శాఖకు AMC ల ద్వారా నవంబరులో రూ.80.03లక్షల ఆదాయం వచ్చినట్లు AD పరమేశ్వరన్ తెలిపారు. పలమనేరు AMC లో రూ.50.58 లక్షలు, చిత్తూరుకు రూ.11.37 లక్షలు, పుంగనూరుకు రూ.7.34 లక్షలు, బంగారుపాళ్యంకు రూ.2.35 లక్షలు, నగరికి రూ.2.16 లక్షలు, కుప్పంకు రూ.4.13 లక్షలు, పెనుమూరుకు రూ.74 వేలు, రొంపిచె ర్లకు రూ.69వేలు, SR పురం రూ.36వేలు, అత్యల్పంగా సోమల AMC ద్వారా రూ.31వేలు వచ్చినట్లు PD తెలిపారు.

News December 16, 2025

పూతలపట్టు: హైవేపై ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన బస్సు

image

పూతలపట్టు మండలం కిచ్చన్న గారి పల్లి సమీపంలో ఆరు లైన్ల జాతీయ రహదారిపై లారీని బస్సు ఢీకొంది. స్థానికుల సమాచారం మేరకు.. సోమవారం రాత్రి ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ప్రయివేట్ బస్సు ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు