News May 23, 2024
ఓట్ల లెక్కింపు అత్యంత కీలకం: కలెక్టర్ నాగలక్ష్మి

ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని విజయనగరం కలెక్టర్, ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. ఆర్ఓలు, ఏఆర్వోలు, డీటీలు, నోడల్ అధికారులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్ ఆడిటోరియంలో తొలివిడత అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు.
Similar News
News March 9, 2026
VZM: డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 107 మందికి రూ.10.70 లక్షల ఫైన్

మద్యం సేవించి వాహనాలు నడిపిన 107 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా, న్యాయస్థానం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.10.70 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు విజయనగరం జిల్లాలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని, మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
News March 9, 2026
VZM: ‘పనిచేసిన 15 రోజుల్లోపే ఖాతాలో వేతనం’

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్-రోజ్గార్, ఆజీవిక మిషన్ చట్టంపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో 125 రోజుల ఉపాధి పని దినాల కల్పనకు పోస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పిస్తామన్నారు. పని చేసిన 15 రోజుల్లోగా వేతనం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు.
News March 9, 2026
VZM: కలెక్టరేట్లో నేడు PGRS కార్యక్రమం

విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


