News August 14, 2025

ఓదెల: నేటి నుంచి తాత్కాలికంగా రైల్వే గేట్ బంద్

image

ఓదెల మండలం రూప్ నారాయణపేట, శానగొండ అనుబంధ గ్రామమైన గొల్లపల్లి గ్రామం మధ్యలో ఉన్న 27వ నంబర్ రైల్వే గేట్ నేటి నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొత్కపల్లి, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ మధ్యలో ఎమర్జన్సీ ట్రాక్ రిపేర్ల సందర్భంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నేటి నుండి ఈ నెల 25 వరకు మూసివేస్తారని తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని వారు కోరారు.

Similar News

News March 13, 2026

కావలి: రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. తలమంచి- అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని సుమారు 27ఏళ్ల వ్యక్తి బెంగళూరు- గువాహటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే కావలి రైల్వే పోలీసులకు తెలపాలని కోరారు.

News March 13, 2026

ఏలూరు: కలెక్టరేట్‌లో మొల్లమాంబ జయంతి

image

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జేసీ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవయిత్రి మొల్ల మాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తి పొందాలని సూచించారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా తక్కువ వ్యవధిలో రచించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

News March 13, 2026

అమ్రాబాద్: గవర్నర్ దంపతులకు అధికారుల ఘన స్వాగతం

image

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల దంపతులకు అమ్రాబాద్ మండలం మన్ననూర్ వద్ద జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. శ్రీశైలం వెళ్తున్న క్రమంలో గెస్ట్ హౌస్ వద్ద కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.