News August 13, 2025

ఓయూలో వివిధ కోర్సుల పరీక్షల ఫీజు స్వీకరణ

image

HYD ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. బీఎస్సీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, బీఎస్సీ ఏవియేషన్ కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజును ఈనెల 18వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News March 13, 2026

HYD: ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సప్లై బంద్!

image

నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందుల బిల్లులు దాదాపు రూ.80 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ కాకపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. వెంటనే తమ బిల్లులు చెల్లించకపోతే మందుల సరఫరా పూర్తిగా నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

News March 13, 2026

ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

image

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.

News March 13, 2026

MNCL: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దేవాపూర్ ఎస్సై గంగారాం కథనం ప్రకారం.. కాసిపేట మండలం లంబాడితండా(డి)కు చెందిన హరీశ్(28) డిప్లొమా పూర్తి చేసి, ఇంజినీరింగ్ మధ్యలో ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడినా ఫలితం దక్కలేదు. ప్రైవేట్ కొలువు చేయలేక, ఒత్తిడికి లోనైన యువకుడు సూసైడ్ నోటు రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు.