News April 1, 2024
ఓయూ నూతన వీసీ ఎంపికపై కసరత్తు

ఓయూకు వచ్చే నెలలో కొత్త వీసీ రానున్నారు. వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న 93 మంది ప్రొఫెసర్లలో అత్యధికంగా రిటైర్ అయిన అధ్యాపకులు, కొందరు ప్రొఫెసర్లు ఓయూతో పాటు ఇతర వర్సిటీలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతోపాటు గతంలో వీసీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ల వివరాలపై ఇంటిలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.
Similar News
News February 17, 2026
HYD: ఆఫీసే నయం.. ఇంటికి వెళ్లాలంటేనే భయం!

‘బాస్ పిలుస్తాడని కాదు.. ఇంటికెళ్తే వచ్చే తలనొప్పి భరించలేక’ ఇదీ నేటి యూత్ మైండ్సెట్. ఆఫీసు పని ఒత్తిడి, టార్గెట్ ఒక ఎత్తైతే, ఇంటికి వెళ్లాక ల్యాప్టాప్ వదలని ‘ఆల్వేస్ అవైలబుల్’ కల్చర్ యువతను నిలువునా దహించేస్తోంది. అందుకే ఇంటికెళ్లి ఆ గందరగోళంలో పడేకంటే, ఆఫీసులోనే కాసేపు ఎక్కువ గడిపి ఆ ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. పని నుంచి తప్పించుకోవడానికి కాదు, మానసిక ప్రశాంతత కోసమే ఈ లేట్ నైట్ తిప్పలు!
News February 16, 2026
HYD: అదిరిందిగా.. కొత్త కమిషనరేట్

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముస్తాబవుతోంది. మేడిపల్లిలోని 56 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న పనులు తుదిదశకు చేరుకున్నాయి. అత్యాధునిక వసతులతో రణగొణధ్వనులకు దూరంగా, రాజసం ఉట్టిపడేలా రూపుదిద్దుకుంటోంది. ప్రజా భద్రత, పరిపాలనా సమర్థతను మరింత బలోపేతం చేసేలా నిర్మితమవుతున్న ఈ కార్యాలయం, పోలీసు వ్యవస్థకు కీలక కేంద్రంగా మారనుంది. రాష్ట్ర సచివాలయాన్ని తలపిస్తూ కనువిందు చేస్తోంది.
News February 16, 2026
HYDలో ‘బయో ఏషియా 2026’ గర్జన రేపే షురూ

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్& హెల్త్-టెక్ సదస్సు ‘బయో ఏషియా 2026ను TG CM రేవంత్ రెడ్డి ఈ నెల 17న సదస్సును అధికారికంగా HITEXలో ప్రారంభించనున్నారు. 50కి పైగా దేశాల నుంచి 4,000 మంది ప్రతినిధులు, 500కుపైగా కంపెనీలు, 175కు పైగా ఎగ్జిబిటర్లతో భారీ అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. TG రైజింగ్ 2047 విజన్ ద్వారా గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చడం వంటి అంశాలపై దృష్టి సారించనుంది.


