News November 8, 2025

కంచిపల్లి శ్రీను హత్య కేసులో 8 మంది అరెస్టు

image

అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను హత్య కేసులో 8 మందిని అరెస్టు చేశామని ఎస్పీ రాహుల్ మీనా శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. తన ఉనికిని చాటుకునేందుకే ప్రధాన నిందితుడు కాసుబాబు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. దూషిస్తూ శ్రీను విడుదల చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరువు పోతుందని భావించి హత్యకు ప్లాన్ చేశాడని చెప్పారు.

Similar News

News January 14, 2026

అనాథ చిన్నారులతో భోగి సంబరాలు జరుపుకున్న కలెక్టర్ దంపతులు

image

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాథ చిన్నారులతో జరుపుకున్నారు. కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ శిశువుల ఆశ్రమాన్ని తన సతీమణితో బుధవారం సందర్శించి శిశుగృహంలో చిన్నారులతో కలిసి భోగి పండుగను జరుపుకున్నారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు.

News January 14, 2026

అంకెల్లో మేడారం..!

image

శానిటేషన్ బ్లాకులు: 285
టాయిలెట్లు: 5,700
పారిశుద్ధ్య సిబ్బంది: 5,000
ట్యాంకర్లు: 150
ట్రాక్టర్లు: 100
స్వీపింగ్ మెషిన్లు: 18
JCBలు: 12
స్వచ్ఛ ఆటోలు: 40
డోజర్లు: 16
ట్రాన్స్‌ఫార్మర్లు: 196
విద్యుత్ స్తంభాలు: 911
విద్యుత్ లైన్లు: 65.75 కి.మీ
విద్యుత్ సిబ్బంది: 350
డీజిల్ జనరేటర్లు(బ్యాకప్): 28
వైద్య సిబ్బంది: 5,192
అంబులెన్సులు: 30
బైక్ అంబులెన్సులు : 40
గజ ఈతగాళ్లు: 210
సింగరేణి రUస్క్యు: 12

News January 14, 2026

చిట్వేల్‌లో సంక్రాంతి పండుగ.. కుటుంబం అంతా ఒకే చోట భోజనం..!

image

సంక్రాంతి పండుగతో కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయని చిట్వేల్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. గత 50 ఏళ్లుగా భోగి రోజున నలుగురు అన్నదమ్ముల కుటుంబాలు కలిసి సంయుక్త అరిటాకు భోజనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. ఈ ఏడాది 46 మంది కుటుంబ సభ్యులు పాల్గొనగా, హైదరాబాదు, బెంగళూరు, విదేశాల్లో ఉన్నవారు కూడా భోగి రోజున కలుస్తారన్నారు. దీంతో కుటుంబాల్లో ప్రేమానురాగాలు మరింత బలపడతాయన్నారు.