News March 26, 2024
కందుకూరు: ఆటో, ట్రాక్టర్ ఢీ..ఒకరు మృతి

మోపాడు సమీపంలో ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. కందుకూరు పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కూలీలు ఆటోలో కూలి పనులకు వెళ్తుండగా మోపాడు సమీపంలో పొగాకు చెక్కలు లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ప్రమాదంలో డాల లక్ష్మమ్మ మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 19, 2026
ప్రకాశం: నేటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.
☞ ఒంగోలులో ….
★ సహర్: ఉ.5-5.21
★ ఇఫ్తార్: సా.6.29
★ ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
☞ నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.
News February 18, 2026
మార్కాపురం జిల్లా మెడికల్ విద్యార్థిని సూసైడ్

మార్కాపురం జిల్లాలో మెడికల్ విద్యార్థిని సూసైడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు (D) గూడూరు(M) పెంచికలపాడులోని విశ్వభారతి మెడికల్ కాలేజీ సోనిక(22) సూసైడ్ చేసుకుంది. తర్లుపాడుకు చెందిన సోనిక పారామెడికల్ అనస్థీషియా ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండి మంగళవారం హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం SI అఖిల్ కేసు నమోదు చేశారు.
News February 18, 2026
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవన్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.


