News June 17, 2024
కడప జిల్లా వాసుల కారుపై పెద్దపులి దాడి

కడప జిల్లా బద్వేలు వాసులు నెల్లూరుకు వెళ్తుండగా కారుపై పెద్దపులి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మర్రిపాడు మండలంలోని కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో హైవేపై వెళ్తుండగా సోమవారం పులి దాడి చేసింది. ఇందులో కారు కొంత దూరం పులిని ఈడ్చుకెళ్లగా పులికి గాయాలయైనట్లు సమాచారం. ప్రమాదం తర్వాత పులి సమీప అడవిలోకి వెళ్లిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Similar News
News January 24, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.16,210
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,913
* వెండి 10 గ్రాములు ధర రూ.3,430.
News January 24, 2026
కడప: 2 బస్సులు ఢీ.. ఒకరు మృతి.!

మార్కాపురం జిల్లా పెద్దారికట్ల జంక్షన్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రొద్దుటూరు వాసి మృతి చెందాడు. పొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తున్న వాసవి ట్రావెల్స్ బస్సు, విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న RTC బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మైదుకూరు- చిన్నయ్యగారిపల్లెకు చెందిన అన్నపురెడ్డి జనార్దన్రెడ్డి (55) మృతి చెందాడు. సుమారు 10 మంది గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 24, 2026
బ్రహ్మంగారిమఠంలో రూ.139 కోట్లతో పనులు

బ్రహ్మంగారిమఠంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రసాదం పథకం ద్వారా రూ.139కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆధునిక హంగులతో దేవస్థానం అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


