News March 30, 2024

కడప: ట్రాక్టర్ ప్రమాదంలో రైతు దుర్మరణం

image

ట్రాక్టర్ బోల్తా పడి లింగాలకు చెందిన జయరామిరెడ్డి అనే రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఈతాకుల కోసం ట్రాక్టర్‌లో వెళ్లాడు. తిరుగు పయణంలో అంబకపల్లి మురారిజింతల గ్రామ సరిహద్దుల్లో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి దగ్గర విలపిస్తున్నారు.

Similar News

News February 14, 2026

ప్రొద్దుటూరు: పెట్రోల్ బంక్ స్కాంలో చెక్ బౌన్స్ కేసు.?

image

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ స్కాంలో చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి. వీటిపై చెక్ బౌన్స్ కేసు పెట్టనున్నారు. పెట్రోల్ బంక్ పూర్వపు మేనేజర్ ప్రవీణ్ బకాయిలకు సంబంధించి సుమారు రూ.50 లక్షల విలువైన 10 చెక్కులను మున్సిపాలిటీకి జమ చేశాడు. ఈ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయని అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ తెలిపారు. పెట్రోల్ బంక్ బకాయిలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపామని కమిషనర్ రవిచంద్రారెడ్డి తెలిపారు.

News February 14, 2026

ప్రొద్దుటూరు: నెహ్రూ రోడ్డులో దారుణ హత్య

image

ప్రొద్దుటూరు పట్టణం నెహ్రూ రోడ్డులో శుక్రవారం రాత్రి సుబ్బు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సుబ్బు బేల్దారి పని చేస్తుంటాడని స్థానికులు తెలిపారు. సుబ్బు, వినయ్ మద్యం తాగి గొడవ పడినట్లు, ఈ గొడవ హత్య వరకు వెళ్లిన్నట్లు సమాచారం. 3వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 13, 2026

రేపు కడపకు రానున్న వైఎస్ షర్మిల

image

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆమె రేపు కడప నగరంలో పర్యటిస్తారు. రాత్రికి ఇడుపులపాయ చేరుకొని రేపు ఉదయం కడప నగరంలోని యానాది కాలనీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు