News August 12, 2025

కడప: ప్రజల తీర్పు ఎటువైపు?

image

ఇవాళ ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 5 వరకు పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలు జరగనున్నాయి. పులివెందులలో 10,606, ఒంటిమిట్టలో 24,606 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక పులివెందులలో హేమంత్ రెడ్డి(YCP), లతారెడ్డి(TDP) నువ్వా నేనా అన్నట్లు పోటీలో నిలిచారు. అలాగే ఒంటిమిట్టలో ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి (YCP), కృష్ణారెడ్డి (TDP) ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ రెండు చోట్ల మొత్తం 22 మంది బరిలో ఉన్నారు.

Similar News

News March 9, 2026

OFFICIAL: ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు <<19299249>>మొజ్తాబా<<>> ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 88 మందితో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ బాడీ ఆయన్ను ఎన్నుకుంది. ఇరానియన్లు ఐక్యతను కాపాడుకోవాలని, మొజ్తాబా ఖమేనీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది. నిర్ణయాత్మక ఓటు ద్వారా ఆయన ఎన్నికైనట్లు సమాచారం. ప్రస్తుతం మొజ్తాబా వయసు 56 ఏళ్లు.

News March 9, 2026

యూట్యూబ్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకోవచ్చు!

image

యూట్యూబ్‌లో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ మళ్లీ రాబోతోంది. యాప్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకునేలా వెసులుబాటు కల్పించే ఈ ఫీచర్‌ను 2019లో కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు కొత్త వెర్షన్‌తో తీసుకురానుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇతర యాప్‌లు అవసరం లేకుండానే యూట్యూబ్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకోవచ్చు. దీనితో పాటు షార్ట్స్ కోసం AI రీమిక్స్ ఫీచర్ కూడా రానుంది.

News March 9, 2026

పోచమ్మమైదాన్ జంక్షన్‌లో ఉద్రిక్తత.. లాఠీచార్జ్

image

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి జెండాను ఓ వర్గానికి చెందిన యువకుడు తొలగించడంతో వివాదం చెలరేగింది. దీంతో మరో వర్గం అక్కడే మళ్లీ జెండా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.