News May 3, 2024
కడియం: 6న మోదీ రాక.. సభా ఏర్పాట్ల పరిశీలన

కూటమి ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన కడియం మండలంలోని వేమగిరి జాతీయ రహదారి వద్ద విజయ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు సభ ఏర్పాట్లను శుక్రవారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ జగదీష్, ఎఎస్పీ అనిల్ కుమార్, జేసీ తేజ భరత్లు పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు.
Similar News
News December 7, 2025
తుఫాను పరిహారం ఏదయ్యా..?

మొంథా తుఫాను ధాటికి జిల్లాలోని 33,262 మంది రైతులకు చెందిన 41,350 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ తుఫాను ప్రభావంతో సుమారు రూ. 40.96 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే తుఫాను సంభవించి నెల రోజులు గడిచినా, ఇంతవరకు పంట నష్టపరిహారం అందకపోవడం పట్ల అన్నదాతలు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
News December 7, 2025
రబీ సాగుకి రైతులు సన్నద్ధం

తూ.గో. జిల్లాలో రైతులు రబీ సాగుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 61,318 హెక్టార్లలో రబీ సాగు లక్ష్యం కాగా, దీనికి 3,066 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉంది. ఇప్పటికే 215 హెక్టార్లలో నారుమళ్లు పోశారు. జిల్లాలో 60 శాతం బోర్ల కింద, 18 శాతం గోదావరి డెల్టాలో, 11 శాతం చెరువుల కింద సాగు చేస్తున్నారు. మిగిలిన 22,543 ఎకరాలు వర్షాధారంగా సాగవుతున్నాయి. బోర్ల కింద రైతులు మురుగు దమ్ము చేసి నారుమళ్లను పోశారు.
News December 7, 2025
రబీ సాగుకి రైతులు సన్నద్ధం

తూ.గో. జిల్లాలో రైతులు రబీ సాగుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 61,318 హెక్టార్లలో రబీ సాగు లక్ష్యం కాగా, దీనికి 3,066 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉంది. ఇప్పటికే 215 హెక్టార్లలో నారుమళ్లు పోశారు. జిల్లాలో 60 శాతం బోర్ల కింద, 18 శాతం గోదావరి డెల్టాలో, 11 శాతం చెరువుల కింద సాగు చేస్తున్నారు. మిగిలిన 22,543 ఎకరాలు వర్షాధారంగా సాగవుతున్నాయి. బోర్ల కింద రైతులు మురుగు దమ్ము చేసి నారుమళ్లను పోశారు.


