News January 26, 2025
‘కదిరిలో అదనపు జిల్లా కోర్టు ఎర్పాటు చేయండి’

కదిరిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని కదిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు అనంతపురానికి వచ్చిన హైకోర్టు జడ్జి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి కే.శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. కదిరిలో జిల్లా అదనపు కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపైన సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు భైరవ ప్రసాద్, సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.
Similar News
News February 17, 2025
ఢిల్లీలో తొక్కిసలాట.. రైల్వేశాఖ అప్రమత్తం

ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో రద్దీ నియంత్రణకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీతో పాటు ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నో, మిర్జాపూర్ రైల్వే స్టేషన్లలో GRP, RPF పోలీసులను భారీగా మోహరించారు. స్టేషన్ బయటే ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తున్నారు. వాహనాలను స్టేషన్ల సమీపంలోకి అనుమతించడంలేదు. రైలు వచ్చాక ప్లాట్ఫాంపైకి ప్రయాణికులను అనుమతిస్తున్నారు.
News February 17, 2025
RECORD: 84 ఏళ్ల కాపురం.. 100+ గ్రాండ్ చిల్డ్రన్

దాంపత్యంలో చిన్న విభేదాలకే విడిపోతున్న ఈ రోజుల్లో 84ఏళ్ల తమ కాపురంతో రికార్డు సృష్టించిన ఓ జంట అందరికీ స్ఫూర్తినిస్తోంది. బ్రెజిల్కు చెందిన మనోయిల్(105), మరియా(101)కు 1940లో పెళ్లయ్యింది. వీరు 13మంది పిల్లలు, 55మంది మనవళ్లు, మనవరాళ్లు, 54మంది గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, 12మంది గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్ను చూశారు. ఒకరిపై ఒకరికి గల ప్రేమ, నమ్మకం వల్లే అన్యోన్యంగా ఉంటున్నామని చెబుతున్నారు.
News February 17, 2025
GBSపై ప్రజలకు అవగాహన కల్పించండి: మంత్రి

AP: GBS అంటు వ్యాధి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. ఇవాళ గుంటూరులో జీజీహెచ్లో ఓ మహిళ GBSతో మరణించడంపై ఆయన స్పందించారు. ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, వ్యాధి <<15225307>>లక్షణాలు<<>> కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ప్రజారోగ్య సంరక్షణే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు.