News January 31, 2025
కరప: సొసైటీ ఇన్చార్జి సీఈవో ఆత్మహత్య

కరప ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సీఈవోగా పనిచేస్తున్న నక్కా నారాయణమూర్తి (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2017 నుంచి ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు. కాగా కాకినాడలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల నుంచి శుక్రవారం అతని తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.
Similar News
News February 12, 2025
జగిత్యాల జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్!

@యువత గుండె నిబ్బరంతో ఉండాలన్న ధర్మపురి సీఐ @వెల్గటూరులో పురుడు పోసిన 108 సిబ్బంది @వెల్గటూరులో ప్రకృతి వైపరీత్యాలపై విద్యార్థులకు NDRF అవగాహన @మెట్పల్లి వైన్స్లో బాటిల్ పై MRP కంటే రూ.30 అదనపు వసూళ్లు @మెట్పల్లి చెర్ల కొండాపూర్లో మొరం అక్రమ రవాణా.. స్థానికుల ఆరోపణలు @కొండగట్టులో మోకాళ్లపై వెళ్లి స్వామిని దర్శించుకున్న భక్తుడు
News February 12, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన MLC ఎన్నికల ప్రచారం@మహిళ గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించిన అదనపు కలెక్టర్లు, అధికారులు @కరాటే ఛాంపియన్షిప్ విద్యార్థులను అభినందించిన జగిత్యాల MLA@కొత్తపేటలో రోడ్డెక్కిన పత్తి రైతులు @ఇబ్రహీంపట్నంలో పరీక్షలపై విద్యార్థులకు MLA సంజయ్ టిప్స్ @రాయికల్లో రేపటినుండి భీమన్న జాతర @ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 1,63,681 ఆదాయం @కొండగట్టు ఆలయంలో భక్తుల రద్దీ
News February 12, 2025
పెద్దపల్లి: వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసును CBIకి అప్పగించేందుకు ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారని పుట్ట మధు తరఫు న్యాయవాది కేసు కొట్టివేయాలని కోర్టును కోరారు. కోర్టు కేసును 2 వారాలకు వాయిదా వేసింది.