News April 12, 2025
కరీంనగర్: ఉద్యోగం పేరుతో మోసం.. కేసు నమోదు

విదేశాలలో ఉద్యోగం పేరుతో యువకుడిని మోసంచేసిన వ్యక్తిపై కేసునమోదుచేసినట్లు 2టౌన్ సీఐ సృజన్రెడ్డి తెలిపారు. KNRభగత్నగర్కు చెందిన మెహర్తేజను HYDకు చెందిన ప్రశాంతరాథోడ్ బ్యాంకాక్లో బిజినెస్ ప్రాసెస్ ఉద్యోగం ఇప్పిస్తానని కొంత డబ్బుతీసుకొని బ్యాంకాక్ పంపించాడు. అక్కడ మోసపూరిత సంస్థలో చేర్పించి పాస్పోర్ట్ తీసుకొని నిర్బంధించారని, అక్కడి పోలీసుల సహాయంతో వచ్చానని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడన్నారు.
Similar News
News April 10, 2026
భద్రాద్రిలో వైభవంగా శ్రీవారి నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి విశేష పూజలు చేసిన అనంతరం, బేడా మండపంలో సీతారాములకు వేద మంత్రాల మధ్య కళ్యాణ తంతు పూర్తి చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.
News April 10, 2026
బెట్టింగ్ యాప్ ప్రమోట్.. విశాఖలో ఇద్దరి అరెస్ట్

విశాఖలోని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఓ కళాశాల ఫుట్బాల్ కోచ్ గణేశ్తో పాటు అనిల్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వీరిద్దరూ మధురవాడ భగవాన్ దాస్ కాలనీ ప్రాంతానికి చెందిన వారే. విశాలాక్షి నగర్లో యువకుడ్ని క్రికెట్ ప్రిడిక్షన్ అంటూ నమ్మించి బెట్టింగ్ యాప్ను ప్రోత్సహించారు. వీరి మాటలు నమ్మిన యువకుడు రూ.12.50 లక్షలు పోగొట్టుకున్నాడు.
News April 10, 2026
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: అడ్లూరి

రైతు పండించిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురి పట్టణ కేంద్రంల్లోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రైతులు రబీ సీజన్లో పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిదన్నారు.


