News February 16, 2025
కరీంనగర్: ‘కేసీఆర్కు పట్టిన గతే సీఎంకు పడుతుంది’

ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలన్నారు. లేకపోతే మాజీ సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్కు పట్టిన గతే పడుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Similar News
News April 14, 2026
KBR బార్ గొడవ కేసులో మరో ఇద్దరి అరెస్ట్: డీఎస్పీ

కర్నూలు కేబీఆర్ బార్ వద్ద జరిగిన గొడవలో విద్యార్థి జాన్ వేస్లీ మృతి కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు DSP ఉపేంద్ర బాబు తెలిపారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా రాజీవ్ నగర్కు చెందిన శాంతిరాజు రెడ్డి, తులాసాపురం శ్రీకాంత్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులను గుర్తించినట్లు, వారి అరెస్టుకు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ వివరించారు.
News April 14, 2026
20 ఏళ్ల పాటు సీఎం.. నేటితో ముగిసిన శకం

బిహార్లో దాదాపు 20 ఏళ్ల పాటు CMగా కొనసాగిన నితీశ్ <<19649099>>శకం<<>> నేటితో ముగిసింది.
*తొలిసారి 2000లో 7 రోజులు
*2005-10 వరకు 1,827 రోజులు
*2010-14 వరకు 1,270 రోజులు
*2015లో 270 రోజులు
*2015 నుంచి 2017 వరకు 614 రోజులు
*2017 జులై నుంచి 2020 వరకు 1,204 రోజులు
*2020 NOV నుంచి 2022 వరకు 631 రోజులు
*2022 AUG నుంచి 2024 వరకు 536 రోజులు
*2024 నుంచి 2025 వరకు 661 రోజులు
*2025 NOV నుంచి 2026 APR వరకు 146 రోజులు
News April 14, 2026
HYDలో 40 దాటింది.. జాగ్రత్త!

HYDలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. నాంపల్లి పరిధిలోని బేగంబజార్ ప్రాంతంలో మంగళవారం గరిష్ఠంగా 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముషీరాబాద్, మారేడ్పల్లిలో, హిమాయత్నగర్ ప్రాంతంలో హిమాయత్నగర్ ప్రాంతంలో 40.5-40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.
SHARE IT


