News February 17, 2025

కరీంనగర్: పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు

image

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 3,55,159 పట్టభద్రుల ఓటర్లు ఉండగా, నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 27,088 మంది ఉన్నారు.

Similar News

News March 17, 2026

జగిత్యాల: జీవన్ రెడ్డి అసంతృప్తి వెనుక బలమైన కారణాలు ఇవే!

image

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి 11 సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచారు. మూడు సార్లు మంత్రి, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. కానీ 2023 తర్వాత మంత్రి పదవి దక్కకపోవడం, MLC రెన్యూవల్ లేకపోవడం అసంతృప్తికి కారణమైంది. డా.సంజయ్‌తో కలిసి పని చేయాల్సి రావడం, మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యం లేకపోవడంతో ఇండిపెండెంట్లను గెలిపించారు. ప్రస్తుతం ఆయన తదుపరి అడుగు ఆసక్తిగా మారింది.

News March 17, 2026

మంగళగిరి: దివ్యాంగులకు రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం!

image

రాష్ట్రంలోని 40 శాతం వికలాంగత్వం ఉన్న దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకాన్ని ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు మంగళగిరి బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తొలుత గుంటూరులో అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వేదికను మంగళగిరికి మార్చారు. ఈ మేరకు ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పర్యవేక్షించారు.

News March 17, 2026

ఆదోని: కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

image

కర్నూలు జిల్లా ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రామకృష్ణపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వేటు వేశారు. మూడు రోజుల క్రితం గార్డెనియా విల్లాస్‌లోని ఓ ఇంటి ప్రహరీ పగలగొట్టి, బాధితుడు రాఘవేంద్రను భయభ్రాంతులకు గురిచేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. శనివారం త్రీటౌన్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో, విచారణ అనంతరం ఎస్పీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.