News October 4, 2025
కరీంనగర్ బస్ స్టేషన్లో రద్దీని పర్యవేక్షించిన ఆర్టీసీ అధికారులు

బతుకమ్మ, దసరా పండగల తర్వాత KNR బస్ స్టేషన్ నుంచి JBS, ఇతర గమ్య స్థానాలకు ప్రయాణికుల తిరుగు ప్రయాణ రద్దీని KNR జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, KNR RM బి.రాజు ఈరోజు పర్యవేక్షించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచాలని KNR బస్ స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.మల్లేశంకు సూచించారు. KNR రీజియన్ డిప్యూటీ RM ఎస్.భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
Similar News
News January 17, 2026
చిత్తూరు: వేంకన్నా.. రైతుల కష్టాలు వినవన్నా.!

<<18883864>>బకాయిల<<>> చెల్లింపులో మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని రైతులు మండిపడుతున్నారు. గతేడాది ఉమ్మడి చిత్తూరు(D)లో రైతుల నుంచి దాదాపు 2.33 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరించారు. KGకి ప్రభుత్వం రూ.4, కంపెనీలు రూ.8 చెల్లించేలా GOVT నిర్ణయం తీసుకుంది. చిత్తూరు-30, తిరుపతి జిల్లాలో 8 ఫ్యాక్టరీలు పంటను కొనుగోలు చేసి 8 నెలలు అవుతున్నా ఇంత వరకు బకాయిలు చెల్లించలేదట.
News January 17, 2026
చిత్తూరు: రైతులకు రూ.400 కోట్ల బకాయిలు.?

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38 పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. చిత్తూరులో 4 కంపెనీలు మాత్రమే రైతులకు పూర్తిస్థాయిలో డబ్బులు జమ చేశాయట. తిరుపతిలో ఒక్క పరిశ్రమ కూడా నగదు జమ చేయలేదు. మరికొన్ని 40 శాతం మందికి చెల్లింపులు చేయగా, 10-14 పరిశ్రమలు ఇప్పటి వరకు రూ.1కూడా ఇవ్వలేదట. ఇంకొన్ని సంస్థలు టన్నుకు రూ.8 వేలకు బదులు రూ.3-4 వేలు జమ చేశాయట. దాదాపు రూ.300-400 కోట్ల వరకు కంపెనీలు రైతులకు బకాయిలు ఉన్నాయి.
News January 17, 2026
పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు.. నేటి నుంచే అమల్లోకి

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన <<18836703>>విషయం<<>> తెలిసిందే. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆర్థిక సాయం భార్య పేరున జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దివ్యాంగ దంపతులకు వివాహానంతరం ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లు తగ్గడంతోపాటు, నివాసం, వైద్య ఖర్చులు, జీవనోపాధికి సహాయ పడుతుందని పేర్కొంది.


