News April 25, 2024
కరీంనగర్: బి ఫారం అందుకున్న వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావుని అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ బి ఫారం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ప్రణవ్ బాబు పాల్గొన్నారు.
Similar News
News April 16, 2026
నిప్పుల కొలిమిలా కరీంనగర్ జిల్లా!

KNR జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గురువారం జిల్లావ్యాప్తంగా ఎండలు ముదిరి, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. మానకొండూరు మండలం ఈదుల గట్టపల్లిలో అత్యధికంగా 44.1°C ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట, తిమ్మాపూర్ మండలాల్లోనూ 43 డిగ్రీలకు పైగా ఎండలు దంచికొట్టాయి. ఏప్రిల్ మధ్యలోనే వడగాల్పులు మొదలవ్వడంతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News April 16, 2026
కరీంనగర్ : అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్కు ఘన వీడ్కోలు

కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ బదిలీపై సిద్దిపేటకు వెళుతున్న సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. లక్ష్మీ కిరణ్ ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుని రెవెన్యూ సమస్యల పరిష్కారంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. వరి కొనుగోలు నిర్వహణలో జిల్లాను ఆదర్శంగా నిలిపారని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెను సన్మానించారు.
News April 15, 2026
KNR: ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.


