News September 11, 2025
కరీంనగర్: రూ.947.21 కోట్లతో ‘హ్యామ్’ రోడ్ల విస్తరణ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రహదారుల అభివృద్ధికి హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటి మోడ్) ప్రోగ్రాం కింద ఆర్అండ్బీ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. రూ.947.21 కోట్లతో 48 పనులు చేపట్టి 616.41 కి.మీ. మేర పనులు పూర్తి చేయనున్నారు. కొత్త రోడ్లను నిర్మించడమే కాకుండా పాత వాటిని విస్తరించడం, రిపేర్లు చేస్తారు. ఫలితంగా గ్రామీణ రోడ్లు జిల్లా కేంద్రాలకు లింక్ అయి ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.
Similar News
News December 9, 2025
IndiGo: నెట్వర్క్ పునరుద్ధరణ.. నేడు 250 సర్వీసులు రద్దు!

ఇండిగో సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. తాజాగా నెట్వర్క్ను పూర్తిగా పునరుద్ధరించినట్లు సంస్థ ప్రకటించింది. అయినా దేశవ్యాప్తంగా నేడు 250కిపైగా సర్వీసులు రద్దు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రయాణికుల ఖాతాల్లో రూ.827 కోట్లు రీఫండ్ చేసినట్లు పేర్కొంది. గోవా, అహ్మదాబాద్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లోని HYD, విశాఖలో ఇవాళ పలు సర్వీసులు రద్దయ్యాయి.
News December 9, 2025
కొత్తగూడెం: ‘హామీలు అమలు చేయకపోతే రాజీనామా’

గెలిపించిన మూడేళ్లలో హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని టేకులపల్లి మండలం కొత్తతండాలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి భూక్యా గీత బాండ్ పేపర్ రాసిచ్చారు. మినరల్ వాటర్ ప్లాంట్, లైబ్రరీ, ఓపెన్ జిమ్, ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి, ఆడబిడ్డ పెళ్లికి రూ.10వేలు, ముత్యాలమ్మ గుడి వరకు రోడ్డు ఏర్పాటు, ఎవరైనా అకాలంగా మరణిస్తే రూ.10వేలు ఇస్తానని బాండ్ పేపర్లో ప్రస్తావించారు.
News December 9, 2025
అనంత జిల్లాలో యువకుడి దారుణ హత్య

అనంతపురం(D) బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలోని వీరభద్ర కాలనీకి చెందిన సాయిచరణ్(23) దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయి చరణ్ స్నేహితులే పొలంలో కొట్టి చంపి, అనంతరం బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


