News September 11, 2025
కరీంనగర్: విజృంభిస్తున్న విష జ్వరాలు..!

ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు దోమలు పెరిగి, డెంగీ, టైఫాయిడ్, విష జ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. నిన్న ఒక్కరోజే 14 వేల ఓపీలు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. అలాగే రామగిరి(M)కి చెందిన ఒకరు విషజ్వరంతో మృతి చెందారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News December 10, 2025
నాగార్జున సాగర్@70ఏళ్లు

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనికి శంకుస్థాపన చేసి నేటికి 70 ఏళ్లు. 1955 DEC 10న ఆనాటి PM నెహ్రూ పునాది రాయి వేశారు. 1967లో ఇందిరా గాంధీ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. 1911లోనే నిజాం ఈ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతోంది.
News December 10, 2025
పోలింగ్ తేదీల్లో సెలవు.. కామారెడ్డి కలెక్టర్ కీలక ఆదేశాలు..

కామారెడ్డి జిల్లాలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల సందర్భంగా, పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలకు ప్రభుత్వ సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే (డిసెంబర్ 11, 14 & 17) ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలకు సెలవు ఉంటుంది. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే ఉద్దేశంగా ఈ వీలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 10, 2025
బ్లాక్ మెయిల్ కాల్స్పై అప్రమత్తంగా ఉండండి: DEO

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని DEO వెంకట లక్ష్మమ్మ మంగళవారం సూచించారు. ఎటువంటి కాల్స్ వచ్చినా రికార్డ్ చేయాలన్నారు. వాటిని లిఖితపూర్వకంగా సంబంధిత పోలీసులకు అందజేయాలన్నారు. కాల్స్కు భయపడి ఎవరికి నగదు చెల్లించవద్దని పేర్కొన్నారు.


