News October 5, 2025
కర్నూలులో ఆడ బిడ్డకు జన్మనిచ్చిన 10th క్లాస్ విద్యార్థిని

కర్నూలు పాతబస్తీకి చెందిన 15 ఏళ్ల బాలిక(10వ తరగతి) ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గతనెల 28న కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికకు తల్లి మాత్రలు వేసింది. నొప్పి మరింత పెరగడంతో పాటు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. ప్రేమ పేరుతో తనకు జరిగిన మోసాన్ని తల్లిదండ్రులకు బాలిక వివరించింది. తండ్రి ఫిర్యాదు మేరకు 1టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News January 15, 2026
దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్లో గుర్తుచేశారు.
News January 15, 2026
MBNR: ఓపెన్ SSC, INTER.. రేపే లాస్ట్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరిన విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఈ నెల 16లోగా (ఫైన్తో) ఎగ్జామ్ ఫీ ఆన్లైన్లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్లో సందర్శించాలన్నారు.
#SHARE IT
News January 15, 2026
విశాఖలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


