News August 14, 2025

కర్నూలు ఐపీఎస్ అధికారికి రాష్ట్రపతి మెడల్

image

కర్నూలుకు చెందిన 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డా.జీవీ సందీప్‌ చక్రవర్తి 6వ రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంటరీకి ఎంపికయ్యారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీనగర్‌ ఎస్ఎస్పీగా సెంట్రల్‌ క్యాడర్‌లో పనిచేస్తున్నారు.

Similar News

News March 17, 2026

కర్నూలు జిల్లాలో 358 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 18,104 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 17,746 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

News March 16, 2026

కర్నూలు జిల్లాలో మొదటి రోజే 1042 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో 1042 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35851 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా.. 34809 మంది విద్యార్థులు హాజరయ్యారు. 702 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సిందిగా 650 మాత్రమే హాజరయ్యారు. 52 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

News March 16, 2026

కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదు: JC

image

కర్నూలు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 11వేల సిలిండర్లు నిల్వలో ఉండగా, అదనంగా 7వేల సిలిండర్లు చేరుకున్నాయన్నారు. ప్రతిరోజు సగటున 10వేల సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ జరుగుతోందన్నారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఏజెన్సీలు ఇబ్బందులు కలిగిస్తే 1967 టోల్ ఫ్రీ నంబర్‌‌ను సంప్రదించాలన్నారు.