News April 14, 2024

కర్నూలు: టీడీపీ ఎన్నికల సమన్వయకర్తలను వీరే

image

రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది. అందులో భాగంగా కర్నూల్ పార్లమెంట్‌కు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, నంద్యాల నియోజకవర్గానికి ఏరాసు ప్రతాపరెడ్డి, కోడుమూరు, ఎమ్మిగనూరుకు సంజీవ్ కుమార్‌ను నియమించింది. ఆలూరు, పత్తికొండలకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆళ్లగడ్డకు కేవీ సుబ్బారెడ్డిలు ఉన్నారు.

Similar News

News December 14, 2025

క‌ర్నూలు అభివృద్ధే నాకు ముఖ్యం: మంత్రి టీజీ భ‌ర‌త్

image

క‌ర్నూలు అభివృద్ధి కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వచ్చిన‌ట్లు రాష్ట్ర పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూల్లో టీడీపీ క‌మిటీల ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. త‌న‌కు కర్నూలు అభివృద్ధే త‌ప్ప వేరే ఆలోచ‌న లేద‌న్నారు. పార్టీ క్యాడ‌ర్ ప్ర‌జ‌ల్లో ఉంటూ స‌మ‌స్య‌లు గుర్తించి ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న సూచించారు. తమ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే అభివృద్ధి ఎంతో జరుగుతుందన్నారు.

News December 14, 2025

కర్నూలు క్రీడాకారులను ఢిల్లీలో అభినందించిన ఎంపీ

image

న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొంటున్న కర్నూలు ఈత క్రీడాకారులను ఎంపీ నాగరాజు ఆదివారం అభినందించారు. అండర్-19 విభాగంలో పాల్గొంటున్న హేమలత, అండర్-17 విభాగంలో పాల్గొంటున్న శృతి, సిరి చేతన రాజ్, లహరి ఢిల్లీలో ఎంపీని కలిశారు. వారు పాల్గొంటున్న ఈవెంట్ల గురించి ఎంపీ అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.

News December 14, 2025

కబడ్డీలో కర్నూలు బాలికలకు మూడో స్థానం

image

పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగిన 51వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో కర్నూలు జిల్లా బాలికల జట్టు మూడో స్థానం సాధించింది. ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 26 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులను ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ అభినందించారు. జట్టులోని ఇందు, లలిత, ప్రశాంతి విశాఖపట్నంలో జరిగే జాతీయ స్థాయి శిక్షణా శిబిరానికి ఎంపికయ్యారు.