News May 14, 2024

కర్నూలు: పోలింగ్ కేంద్రంలో వ్యక్తి మృతి

image

మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఈరన్న సోమవారం ఓటేసేందుకు వెళ్లి పోలింగ్ బూత్‌లోనే మృతిచెందారు. మాధవరంలో ప్రాథమిక పాఠశాలలో ఓటేసేందుకు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. అప్పటికే కళ్లు తిరుగుతున్నాయని తోటి ఓటర్లతో చెప్పారు. చివరికి ఓటు వేసి బయటకు వస్తుండగా స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్న ఎన్నికల సిబ్బంది, తోటి ఓటర్లు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందారు.

Similar News

News December 11, 2025

కర్నూలు డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్

image

కర్నూలు విద్యాశాఖ అధికారిగా గురువారం ఎల్.సుధాకర్ బాధితులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ A.సిరిని మర్యాదపూర్వకంగా కలిశారు. డీఈవో మాట్లాడుతూ.. రానున్న పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలసికట్టుగా కృషి చేస్తామన్నారు. జిల్లాలో విద్యార్థుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.

News December 11, 2025

ప్రజా సేవల్లో సంతృప్తి పెంచేందుకు చర్యలు: కర్నూలు కలెక్టర్

image

పెన్షన్, రేషన్, ఆసుపత్రి సేవలు, అన్నా క్యాంటీన్లు తదితర ప్రభుత్వ సేవల్లో ప్రజల సంతృప్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి, సీఎస్ విజయానంద్‌కు వివరించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ అధికారులను ఉద్దేశించి అవినీతి లేకుండా, లబ్ధిదారులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని సూచించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News December 11, 2025

ఎస్‌ఐఆర్ పూర్తికి సహకరించండి: కర్నూలు ఆర్వో విశ్వనాథ్

image

కర్నూలు అసెంబ్లీలో ఎస్‌ఐఆర్‌ను బూత్ స్థాయిలో ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆర్వో పి.విశ్వనాథ్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ వివరాలు, చిరునామా, ప్రోజనీ సమాచారాన్ని తప్పనిసరిగా బూత్ యాప్‌లో నమోదు చేయాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కర్నూలులో 2,74,803 ఓటర్లలో ఇప్పటివరకు 37,561 మ్యాపింగ్, 15,821 ప్రోజనీ పూర్తి అయ్యాయన్నారు.