News November 19, 2025

కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

image

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News January 15, 2026

సీఎం పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

image

భోరజ్ మండలం చనాక కొరాట వద్ద ఏర్పాటు చేసిన పంప్ హౌస్‌ను రేపు ప్రారంభించేందుకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని, ఆ మేరకు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఎస్పీ, కలెక్టర్ ఆదేశించారు.

News January 15, 2026

ఇరాన్ పాలకులు మారితే ఇండియాకు నష్టమా?

image

ఇరాన్‌లో పాలనాపగ్గాలు మారితే భారత్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మన దేశం నుంచి అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఆసియాకు వెళ్లే మార్గాన్ని పాకిస్థాన్ మూసేసింది. ఇరాన్ నుంచే వెళ్తున్నాం. కొత్త పాలకులు వస్తే ఏం చేస్తారనేది సస్పెన్సే. అలాగే ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్ట్ సందిగ్ధంలో పడుతుంది. ఇరాన్ బలహీనపడితే సున్నీ మెజారిటీ ఉన్న పాకిస్థాన్ బలపడే ఛాన్సుంది.

News January 15, 2026

అన్నమయ్య జిల్లాలో కొర్రమీను పెంపకం.. లాభాలమయం..!

image

అన్నమయ్య జిల్లాలో PMDDKY పథకం కింద ఫామ్‌పాండ్‌ల ఆధారంగా (ముర్రెల్)‌ కొర్రమీను పెంపకం విజయవంతంగా సాగుతోంది. కిలోకు రూ.300 – రూ.500 వరకు లభించడంతో లాభాలు వస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతులతో ఒక్క సైకిల్‌లో 0.5 నుంచి 1 టన్ను వరకు ఉత్పత్తి వస్తోంది. ఉద్యానవన పంటలతోపాటు చేపల సాగు చేపడితే ఒక్క పంటకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు నికర ఆదాయం లభిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇండియా పేర్కొంది.