News November 19, 2025
కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News January 22, 2026
ఖమ్మం: ఆ ఇంట్లో అల్లుడే దొంగ..!

అత్తవారి ఇల్లు అల్లుడికి అడ్డా అనుకున్నాడో ఏమో గానీ, ఏకంగా నగలే ఊడ్చేశాడు. కారేపల్లి మండలానికి చెందిన రాంబాబు మద్యానికి బానిసై, డబ్బుల కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని తన అత్త కలమ్మ ఇంట్లోనే ఒకటిన్నర తులాల బంగారు నెక్లెస్ దొంగిలించాడు. దాన్ని అమ్మేందుకు వెళ్తుండగా KMM సత్యనారాయణపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసుల తనిఖీల్లో చిక్కాడు. అల్లుడే దొంగ అని తేలడంతో బాధితురాలు విస్మయం వ్యక్తం చేసింది.
News January 22, 2026
భారత్ ఘన విజయం

న్యూజిలాండ్తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో 48 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో NZ తడబడింది. ఫిలిప్స్(78), చాప్మన్(39) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. IND బౌలర్లలో చక్రవర్తి, దూబె చెరో 2, అక్షర్, అర్ష్దీప్, హార్దిక్ తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్లో అభిషేక్(84), రింకూ సింగ్(44), సూర్యకుమార్(32) రాణించారు.
News January 22, 2026
చికిత్సకు డబ్బులు లేవని.. హృదయ విదారక ఘటన

TG: HYD కూకట్పల్లిలో హృదయ విదారక ఘటన జరిగింది. దివ్యాంగురాలైన కూతురు శ్రీజావలి(18) ట్రీట్మెంట్కు డబ్బులు లేవని తల్లిదండ్రులే గొంతునులిమి చంపేశారు. తర్వాత 2రోజులు శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇవాళ కొడుకు నితిల్తో కలిసి భార్యభర్తలు సతీశ్, ఆమని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అది పనిచేయలేదని ముగ్గురూ చేతులు కోసుకున్నారు. బాధ భరించలేక నితిల్ తన ఫ్రెండ్కు ఫోన్ చేయడంతో విషయం బయటపడింది.


