News August 12, 2025

కలికిరి నేతకు ఛైర్మన్ పదవి

image

కలికిరి మండలం కొటాలకు చెందిన టీడీపీ నేత వాసునూరి చంద్రశేఖర్‌కు కీలక పదవి లభించింది. ఏపీ జంగం సంక్షేమ, అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ఆయన టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చొరవతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 6, 2026

కొత్తపట్నంలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

కొత్తపట్నం మండలం కే పల్లిపాలెం తుఫాన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పెదగంజం గ్రామానికి చెందిన పాలేటి గోపి (29)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక SI వేముల సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని SI తెలిపారు.

News March 6, 2026

స్టడీ టూర్‌కు పట్టుబడుతున్న జీవీఎంసీ కార్పొరేటర్లు

image

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరోసారి స్టడీ టూర్ నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కనీసం ఒక్కసారి అధ్యయన యాత్రకు అనుమతి ఇవ్వాలని మేయర్, కమిషనర్‌ను కోరుతున్నారు. ఐదేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు మాత్రమే యాత్రలు జరిగాయని, ఒక సంవత్సరం మిగిలిపోయిందని వారు చెబుతున్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు టూర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News March 6, 2026

BREAKING ఖమ్మం: భార్యకు నిప్పంటించి భర్త ఆత్మహత్య

image

తిరుమలాయపాలెంలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తోటమల్ల నాగభూషణం తన భార్య జయమ్మ నిద్రిస్తుండగా ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగభూషణం అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన జయమ్మను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.