News March 30, 2024
కల్వకుర్తి: సీఎంని కలిసిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్
మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం రాత్రి కలిశారు. ఆయన మొన్నటి వరకు బీజేపీలో కొనసాగి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో నాగర్ కర్నూల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని సీఎం సూచించారు.
Similar News
News January 25, 2025
MBNR: BC స్టడీ సర్కిల్.. APPLY చేసుకోండి.!
ఉమ్మడి బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ అభివృద్ధి అధికారి ఆర్.ఇందిర, డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. MBNR, NGKL, NRPT జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 12,13,14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 25, 2025
MBNR: రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే
రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా క్రీడా మైదానంలో రూ.13 లక్షలతో నిర్మించిన డ్రెస్సింగ్ (కబడ్డీ క్రీడాకారిణిలకు) రూమ్, క్రీడా సామగ్రి స్టోర్ రూమును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులను పరిచయం చేయాలని అన్నారు.
News January 24, 2025
MBNR: తెలంగాణ విధ్వంసానికి కారణం కల్వకుంట్ల కుటుంబమే: ఎమ్మెల్యే
కల్వకుంట్ల కుటుంబంలోని ఆ నలుగురే తెలంగాణ విధ్వంసానికి కారణమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజంఎత్తారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో చేస్తున్న అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవుతుందని ధీమా వ్యక్తంచేశారు.