News March 5, 2025
కవిటి : పెళ్లి ఫిక్స్.. యువతి సూసైడ్

నిశ్చితార్థమై పెళ్లి జరగాల్సిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కవిటి (M) కపాసుకుద్దిలో మంగళవారం జరిగింది. ఎస్సై వి. రవివర్మ కథనం.. వడ్డిపుట్టుగకు చెందిన సోనియాకు ఇటీవల నిశ్చితార్థమైంది. కాగా ఆమె పెళ్లి మే నెలలో జరగాల్సి ఉంది. అయితే ఆమె మానసిక స్థితి సరిగా లేదని , ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 14, 2025
శ్రీకాకుళం: సండే టాప్ న్యూస్ ఇవే

✦యువత ధర్మం పట్ల అవగాహాన పెంచుకోవాలి: ఎమ్మెల్యే మామిడి
✦నరసన్నపేట: డంపింగ్ యార్డులో మళ్లీ చెలరేగిన మంటలు
✦ పితాళినల్లూరులో ఎలుగులు హాల్ చల్
✦గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ
✦టెక్కలి: అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు
✦రణస్థలం: వంతెన కోసం తీసిన గోతిలో పడి బైకర్ మృతి
✦లావేరు: ప్రమాదకరంగా మలుపులు
✦నరసన్నపేట పోలీస్ స్టేషన్కు ఎస్ఐ లేరు
News December 14, 2025
సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కేదెప్పుడు?

ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు ఉపాధి కోసం అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరంతా సంక్రాంతికి తమ సొంతూరికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే అన్ని రైళ్ల టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News December 13, 2025
SKLM: ‘సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతల్లేకుండా చేయాలి’

సంక్రాంతి పండగ నాటికి జిల్లాలోని రహదారులను గుంతలు లేని రోడ్లుగా మార్చాలని, మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్తో కలిసి ఆయన ఆర్అండ్బీ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రూ.82 కోట్ల విలువైన 28 పనులు మంజూరయ్యాయని అన్నారు.


