News September 10, 2025
కస్తూర్బా గాంధీ పాఠశాలలకు 4 ఉత్తమ పురస్కారాలు : డిఈఓ

జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయ అధ్యాపకులకు నాలుగు ఉత్తమ పురస్కారాలు వచ్చినట్లు డిఈఓ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఉత్తమ SOగా రెబ్బెన కేజీబీవీ ప్రత్యేక అధికారి పద్మ, ఉత్తమ టీచర్ గా కాగజ్ నగర్ కేజీబీవీ సీఆర్టీ నిర్మల, ఉత్తమ పీఈటీగా ఆసిఫాబాద్ కేజీబీవీ సువర్ణ, స్పెషల్ కేటగిరీ కింద సిర్పూర్ యు కేజీబీవీ ప్రత్యేక అధికారి స్వప్నలకు ఉత్తమ పురస్కారాలు అందినట్లు తెలిపారు.
Similar News
News December 9, 2025
మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే..

TG: దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఈ నెల 13న HYDలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆ రోజు 4PMకు ఆయన HYD చేరుకొని ఓ హోటల్లో రెస్ట్ తీసుకుంటారు. రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లి సీఎం రేవంత్ టీంతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత స్కూల్ పిల్లలతో ఇంటరాక్షన్ ఉండనుంది. అనంతరం పరేడ్, మెస్సీకి సన్మానం నిర్వహించనున్నారు. దాదాపు 2గంటల పర్యటన తర్వాత మెస్సీ అదే రోజు తిరుగు పయనమవుతారు.
News December 9, 2025
గొర్రె, మేక పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.
News December 9, 2025
పంచాయతీ ఎన్నికల్లో వారే అధికం!

TG: జీపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. మొత్తం 1,66,48,496 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించగా అందులో 81,38,937 మంది పురుషులు, 85,09,059 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఇతరుల సంఖ్య 500గా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 3.50 లక్షలు అధికం. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో(11, 14, 17) పోలింగ్ కోసం 1,12,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది.


