News February 2, 2025

కాంగ్రెస్‌లోని రెడ్లకే టికెట్లు ఇస్తే బీసీ కులగణన ఎందుకు?: జాజుల

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.

Similar News

News February 18, 2025

HYD: శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ

image

శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్‌ అధికారులకు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతణ్ణి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసరు. ప్రయాణికుడిని అమీర్‌ అహ్మద్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

News February 18, 2025

BREAKING: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తప్పిన ప్రమాదం

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూ డార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడింది. దీంతో రన్ వేపై అత్యవసర ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనంతరం కార్గో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

News February 18, 2025

HYD: నేటి నుండి TGCSB షీల్డ్ కాంక్లేవ్

image

నేటి నుంచి 2రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో షీల్డ్ కాంక్లేవ్ 2025 జరగనుంది. సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించే ఆవిష్కరణలపై కాంక్లేవ్‌కు సీఎం రేవంత్, పోలీస్ ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు 1,200 సైబర్ భద్రత నిపుణులు దరాఖాస్తులు చేసుకోగా 590 మందిని TGCSB సెలెక్ట్ చేసింది.

error: Content is protected !!